ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ కు వెళ్లిన ఐకాన్ స్టార్‌.. కానీ వెకెషన్‌ కోసం కాదు!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌, వైజాగ్‌ లో జరుపుకొని ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.  ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ కి వెళ్లాడు. అయితే ఇది వెకేషన్‌ కోసం మాత్రం కాదని సమాచారం.

సాధారణంగా ఫిల్మ్‌ స్టార్స్‌ విదేశాలకు వెళ్లారు అంటే అది కచ్చితంగా వెకేషన్‌ కోసమే కానీ మామూలుగా వెళ్లారు. ఇప్పుడు అల్లు అర్జున్ వెకేషన్‌ కోసం కాకుండా దేని కోసం వెళ్లాడో తెలుసా..! ఆయన మైనపు విగ్రహావిష్కరణ కోసం. ఈ ఈవెంట్‌ కోసమే బన్నీ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ కి వెళ్లాడు.

దుబాయ్‌ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. పుష్ప సినిమాతో జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్న బన్నీ విగ్రహాన్ని దుబాయ్‌లో మ్యూజియంలో ఏర్పాటు చేయడంతో బన్నీతో పాటు ఆయన ఫ్యాన్స్‌ కూడా పిచ్చ హ్యాపీగా ఉన్నారు.

ఆ విగ్రహాం కోసం బన్నీ పోయిన ఏడాదిలోనే కొలతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మార్చి 28న రాత్రి 8 గంటలకు జరగునుంది. అయితే తెలుగు హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్‌ హీరోల మైనపు విగ్రహాలు కూడా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉన్నాయి. కానీ అది లండన్‌. దుబాయ్‌ మ్యూజియంలో తొలి ఇండియన్‌ యాక్టర్ గా బన్నీ కి మాత్రమే ఆ గౌరవం దక్కింది.

Related Posts

Comments

spot_img

Recent Stories