25 ఏళ్ల తరువాత రాబోతున్న క్రేజీ కాంబో!

ఇండియన్‌ మైఖల్‌ జాక్సన్‌ ప్రభుదేవా గురించి తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సుందరం మాస్టారు కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టారు అనే చెప్పే స్థాయికి ఎదిగాడు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌  రెహమాన్‌ గురించి కూడా పెద్దగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరు కలిసి 90 దశకంలో ఐదు సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచాయి. వీరిద్దరి మొదటి సినిమా జెంటిల్‌ మెన్‌. ఆ సినిమాలో చికుబుకుచికుబుకు రైలే సాంగ్‌ ఏ రేంజ్‌ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ప్రేమికుడు చేశారు. ఇందులో ప్రభుదేవా హీరోగా కూడా చేశాడు.

ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆ తరువాత లవ్‌ బర్డ్స్‌, మిస్టర్ రోమియో, మెరుపు కలలు లాంటి సినిమాలు వచ్చాయి. మెరుపుకలలు సినిమాలో పాటలకు ఇప్పటికీ ప్రేక్షకులు స్టెప్స్‌ వేస్తారు. ఈ క్రమంలోనే సుమారు 25 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది.

త్వరలోనే ఏఆర్‌ఆర్‌పీడీ 6 పేరుతో ఓ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్‌ మనోజ్‌ ఎంఎస్‌ డైరెక్షన్‌ వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో యోగిబాబు, వర్గీస్‌, అర్జున్‌ అశోకన్‌, డాక్టర్‌ సంతోష్‌ జాకబ్‌ , సుస్మితా నాయక్‌, మొట్టా రాజేంద్రన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ ను శుక్రవారం లాంచ్ చేశారు.

ఈ సినిమాలో ముక్కాలా ముక్కాబులా సాంగ్‌ లో ప్రభుదేవా స్టెప్స్‌ కు సంబంధించిన ఫొటోతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ లో రెహమాన్‌ పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో అభిమానులు వీరి కాంబో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories