ఓం భీమ్‌ బుష్‌.. నో లాజిక్‌..ఓన్లీ మ్యాజిక్‌..అంటున్న యంగ్‌ హీరోస్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోస్‌ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓం భీమ్‌ బుష్‌ ..నో లాజిక్‌..ఓన్లీ మ్యాజిక్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా మొత్తం కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి హుషార్‌ ఫేమ్‌ కొనుగంటి శ్రీ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలవ్వగా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోలు ముగ్గురు గుప్త నిధుల కోసం సైంటిస్టులమని చెప్పుకొని భైరవపురం గ్రామంలో మకాం వేస్తారు.

ఆ ఊరిలో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని గ్రామంలో అందర్ని తమ వైపునకు తిప్పుకుంటారు. ఈ క్రమంలోనే బ్యాంక్‌ బ్రోస్‌ క్లబ్‌ ను కూడా ఏర్పాటు చేస్తారు. అదే ఊరిలో ఉన్న ఓ సన్యాసి సంపంగి మహల్‌ ఉన్న నిధిని తీసుకురావాలని ఓ సవాల్‌ విసురుతాడు. దీంతో ఆ నిధిని ఎలా అయినా కనిపెడతామంటూ హీరోలు ముగ్గురు సంపంగి మహల్‌ లోకి ఎంట్రీ ఇస్తారు.

 ఆ ముగ్గురు మహల్‌ లోకి వెళ్లిన తరువాత అసలు కథ ప్రారంభం అవుతుంది. నిజంగా ఆ మహల్‌ లో ఏముంది? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మాత్రం కచ్చితంగా సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర బృందం. మొదటి నుంచి చివరి వరకు కామెడీ తో ఈ సినిమా సాగుతుంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక బ్రోచేవారెవరురా తరువాత వీరి ముగ్గురి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుంది. దీంతో ఈ సినిమా పై బానే అంచనాలున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories