మంచు మనోజ్‌ భార్య కు సీమంతం వేడుకలు.. కనిపించని మంచు కుటుంబం!

మంచు మనోజ్‌ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీకి కవల పిల్లలు పుట్టబోతున్నారని కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో వాటిని మంచు మనోజ్‌ ఖండించారు. మాకు కవల పిల్లలు కాదు అని, మే నెలలో బిడ్డ పుట్టబోతున్నట్లు వివరించారు.

ఈ క్రమంలోనే తాజాగా…మంచు మనోజ్‌ భార్య మౌనిక సీమంతం వేడుకలు జరిగాయి. మౌనిక పుట్టింట్లో చాలా కొద్ది మంది అతిథుల మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. మంచు మనోజ్‌ కి, భూమా మౌనిక రెడ్డికి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహామే. భూమా మౌనికకు ఇంతకు ముందే ఓ కుమారుడు ఉన్నాడు.

ఆ బిడ్డను శివుడు తనకు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నట్లు మంచు మనోజ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే వారి మధ్యకు మరో బిడ్డ రాబోతున్నట్లు తెలిపారు. కొంతకాలం క్రితమే మౌనిక తల్లి కాబోతుందని మంచు మనోజ్‌ తెలిపారు. మంచు మనోజ్‌ తన భార్యకు ఎంతో ఘనంగా సీమంతం జరిపించాడు.

అయితే ఈ వేడుకలో ఎక్కడ కూడా మనోజ్‌ కుటుంబ సభ్యులు కనిపించలేదు. వీరి పెళ్లికి ముందు నుంచి కూడా మంచు కుటుంబం అంగీకారం తెలపలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వారు ఈ వేడుకకు రాలేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మనోజ్‌ దగ్గరుండి పెళ్లి చేసిన మంచు లక్ష్మి కూడా ఎక్కడ కనిపించకపోవడంతో మనోజ్‌ మంచు ఫ్యామిలీకి దూరం అయినట్లు వస్తున్న వార్తలు నిజమని అనిపిస్తుంది.

మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే మంచు కుటుంబ సభ్యులు స్పందించాల్సిందే మరి!

Related Posts

Comments

spot_img

Recent Stories