అత్తింటి పోరు భరించలేకే ముంబైకి వెళ్లిపోయారా.. అందుకే చెన్నైకి రావడం లేదా!

అత్తింటి పోరు భరించలేకే ముంబైకి వెళ్లిపోయారా.. అందుకే చెన్నైకి రావడం లేదా!

తమిళ స్టార్ కపుల్‌ సూర్య, జ్యోతిక లు చెన్నై ని వదిలి ముంబై కి మకాం మార్చిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులతో గొడవలు రావడంతో చెన్నై నుంచి వదిలి ముంబై వెళ్లిపోయినట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటున్నాడు. జ్యోతిక కూడా తమిళం, మలయాళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.

ముంబైలోనే ఓ ఇల్లు కూడా కొనేసుకుని అక్కడే ఉండడంతో అత్తమామలతో గొడవల కారణంగానే జ్యోతిక చెన్నై రావడానికి ఇష్టపడట్లేదని టాక్‌ వినిపిస్తుంది. కానీ ఈ విషయం గురించి సూర్య ని అడిగితే పిల్లల చదువుల కోసం ముంబైకి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు కానీ.. జ్యోతిక కు అత్తమావలకు పడక పోవడం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వీరు ముంబైకి వెళ్లినప్పటి నుంచి కూడా సూర్య మాత్రమే చెన్నైకి వస్తున్నాడు కానీ జ్యోతిక ఒక్కసారి కూడా చెన్నైకి రాలేదు. కొద్ది రోజుల క్రితం ఆమె సోదరి రోషిణి ఆమెకు చెన్నైలో ఓ ఫంక్షన్‌ ఆహ్వాన పత్రం ఇచ్చినప్పటికీ జ్యోతిక మాత్రం చెన్నై రావడానికి ఇష్టపడలేదనే తెలుస్తుంది.

అటు సూర్య కూడా జ్యోతిక ఇష్టాన్ని కాదు అనలేక బలవంతం ఏమి లేదు కావాలంటే రా..లేకపోతే లేదు అని చెప్పడంతో జ్యోతిక అసలు చెన్నైకి రావడం లేదని తెలుస్తుంది. బాలీవుడ్‌ లో కూడా జ్యోతికకు ఆఫర్స్‌ భారీగా వస్తున్నాయి. దీంతో ఆమె చెన్నైకి రావడానికి అసలు ఇష్టపడట్లేదని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories