తిరుమలలో జాన్వీ కపూర్‌.. తోడుగా ఎవరున్నారంటే!

తిరుమలలో జాన్వీ కపూర్‌.. తోడుగా ఎవరున్నారంటే!

అతిలోక సుందరి శ్రీదేవి బోనీ కపూర్ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే జాన్వీ తిరుమల రావడం ఇది మొదటి సారి కాదు. ఆమె ప్రతి నెలా స్వామి వారి దర్శనానికి వస్తునే ఉంటుంది. అయితే ఈసారి జాన్వీ వెంట ఉన్న వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఎందుకంటే ఆ వ్యక్తి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియా. చాలా కాలం నుంచి వీరిద్దరూ చాలా చోట్ల కనిపించారు. కొన్ని పార్టీలకు హాజరయ్యారు. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకు ముందు కూడా జాన్వీ శిఖర్‌ తో కలిసి స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చింది.

ఆ తరువాత ఇద్దరు కలిసి కొన్ని పూజలు కూడా చేశారు. ఇప్పుడు తిరుమలలో పుట్టిన రోజునాడు కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌ గా మారాయి. సోషల్ మీడియాలో శ్రీదేవి అల్లుడు అంటూ శిఖర్‌ ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు. జాన్వీ , శిఖర్‌ వెంట నటి మహేశ్వరి కూడా ఉన్నారు.

జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని కొత్త చిత్రాల అప్డేట్‌ లను కూడా బోనీ కపూర్‌ ప్రకటించారు. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్‌ సరసన దేవర సినిమాలో నటిస్తుండగా తాజాగా రామ్‌ చరణ్‌ సరసన మరో తెలుగు సినిమాలో కూడా జాన్వీ మెరవనున్నట్లు స్వయంగా బోనీ కపూరే తెలియజేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories