ఎప్పటికీ ఆ పని చేయను..మరోసారి క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్‌ బ్రాం

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె ఏం అనుకుంటుందో అదే చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటుందో ఓ క్లారిటీతో చెప్పేస్తుంది. అది కొందరికీ నచ్చుతుంది…మరికొందరికీ నచ్చదు. కానీ ఆమె మాత్రం అలానే ఉంటుంంది. ఇప్పుడు తాజాగా మరో విషయం గురించి కంగనా ఓ క్లారిటీ ఇచ్చింది. అది ఏంటి అంటే… ఎన్ని వందల కోట్లు నాకు ఆఫర్ చేసినా సరే నేను మాత్రం పెళ్లిళ్లు, ఫంక్షన్లకు స్టేజీ ఎక్కి ప్రదర్శనలు ఇవ్వను అంటూ.

అసలు ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎందుకు ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే..కొద్ది రోజుల క్రితం భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి ఎందరో స్టార్లు హాజరయ్యారు.

వారంతా ఓ క్రమంలో స్టేజీ ఎక్కి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అలా చేయడానికి వారు ఎక్కువ మొత్తంలో నగదు తీసుకున్నట్లు అడపాదడపా వినిపించింది. దీంతో ఈ విషయం విన్న కంగనా అలాంటి పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్దంగా లేనని, ఈ విషయంలో తనకు గాయని లతా మంగేష్కర్‌ ఆదర్శం అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే లతా మంగేష్కర్‌ కూడా గతంలో ఎన్ని మిలియన్ల డబ్బు ఇచ్చినప్పటికీ పెళ్లిళ్లలో మాత్రం పాట పాడను అని చెప్పారు.

ఇప్పుడు తాజాగా కంగనా కూడా అదే బాటలో నడుస్తున్నట్లు ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. అందుకే ఎన్నో అవార్డుల ఫంక్షన్లు, ఇలాంటి ప్రముఖుల కార్యక్రమాలకు తనకు కొన్ని వందల కోట్ల రూపాయల ఆఫర్‌ వచ్చినప్పటికీ వాటిని అన్నిటిని తిరస్కరించినట్లు తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories