ఆ సౌత్‌ స్టార్ దర్శకునితో సినిమా చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్ స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. సరైన హిట్‌ కోసం ఈ కండల వీరుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. గతేడాది సల్మాన్‌ నుంచి వచ్చిన కీసికి భాయ్‌ కీసికి జాన్‌, టైగర్‌ 3 చిత్రాలు ఏదో ఫర్వాలేదు అనిపించాయి కానీ హిట్‌ టాక్‌ ను మాత్రం తెచ్చుకోలేదు.

ఇప్పుడు సల్మాన్‌ షారుక్‌ ఖాన్‌ తో కలిసి టైగర్ వర్సెస్‌ పఠాన్‌ అనే చిత్రంలో నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే సల్మాన్ తన తరువాత చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు. అది కూడా ఏ బాలీవుడ్ డైరెక్టర్‌ తోనూ కాదు. ఓ సౌత్ స్టార్‌ డైరెక్టర్‌ తో .. ఆయన మరెవరో కాదు… ఏ ఆర్‌ మురుగదాస్‌.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రానికి సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మాతగా ఉన్నారు. ఈ కొత్త సినిమా గురించి సల్మాన్‌ ఖాన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న ఏఆర్‌ మురుగుదాస్‌, నా ప్రియ మిత్రుడు అయినటు వంటి సాజిద్‌ నడియడ్ వాలాతో ఓ సినిమా ను చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

మా కాంబో ఎంతో ప్రత్యేకమైనది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం ఎప్పుడూ మా మీద ఉంటాయని ఆశిస్తున్నాను అంటూ సల్మాన్‌ ట్వీట్ చేశారు. వచ్చే సంవత్సరం ఈద్‌ కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సల్మాన్‌ వివరించారు. తమిళ స్టార్ డైరెక్టర్ అయినటు వంటి ఏఆర్‌ మురుగదాస్‌…అమిర్‌ ఖాన్‌ తో గజినీ హిందీ రీమేక్‌ చేసిన తరువాత బాలీవుడ్‌ లో కూడా బాగా ఫేమస్‌ అయ్యారు. గజినీ హిందీ రీమేక్‌ తో బాలీవుడ్‌ లో కూడా మురుగదాస్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు.

గజినీ తరువాత మరో రెండు చిత్రాలను కూడా మురుగదాస్‌ హిందీలో చేశారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్‌ తో ఓ భారీ మూవీని చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి ఇండియాతో పాటు పోర్చుగల్ , యూరప్‌ దేశాల్లో కొన్ని లోకేషన్లను పరిశీలించినట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories